వారి కష్టాలను చూడని వాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు: హరీష్రావు
ABN , First Publish Date - 2020-04-08T20:42:56+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ సేవలను ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్రావు ప్రశంసించారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ సేవలను ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్రావు ప్రశంసించారు. ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న సైనికుల ఫోటోలను పోస్ట్ చేసిన ఆయన వారిని సరిహద్దులో సైనికులతో పోల్చుతూ కొనియాడారు.
‘‘సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్ డౌన్ ను విజయవంతం చేయడం. వారికి నా శాల్యూట్!’’ అని హరీష్రావు ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్పై తెలంగాణ డీజీపీ స్పందించారు. ‘‘ధన్యవాదాలు సార్.. మీ యొక్క ప్రోత్సాహం.. ప్రజల సహకారంతో కచ్చితంగా మహమ్మారి వ్యాప్తిని అరికట్టే దిశగా మేము ముందుకు వెళతాం’’ అని పేర్కొన్నారు.