పోస్టాఫీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయాన్ని అందజేస్తాం: హరీష్ రావు
ABN , First Publish Date - 2020-05-10T00:23:15+05:30 IST
పోస్టాఫీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయాన్ని అందజేస్తాం: హరీష్ రావు
![పోస్టాఫీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయాన్ని అందజేస్తాం: హరీష్ రావు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020050906502677/05092020185310n57.gif)
హైదారాబాద్: కరోనా నేపథ్యంలో సోమవారం నుంచి పోస్టాఫీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రెండో విడత రూ.1500 ఆర్థిక సాయం గత వారమే బ్యాంకుల ద్వారా ఇచ్చామని, బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకునేందుకు అందరూ ఒకే సారి వెళ్లవద్దని మంత్రి సూచించారు. భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని ట్విట్టర్లో మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.