మొక్కజొన్న కొనాలని నిర్ణయించాం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-11-13T19:17:00+05:30 IST

సిద్దిపేట: రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. మొక్కజొన్న కొనాలని నిర్ణయించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

మొక్కజొన్న కొనాలని నిర్ణయించాం: హరీష్‌రావు

సిద్దిపేట: రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. మొక్కజొన్న కొనాలని నిర్ణయించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. గతేడాది కొన్న మక్కలు గోడౌన్లలో అలానే ఉన్నాయని హరీష్‌రావు పేర్కొన్నారు. జిల్లాలో 30 కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తామన్నారు. 8 శాతం తేమ ఉన్నా పత్తికి రూ.5,775 మద్దతు ధర ఇస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు. రూ.1,888 మద్దతు ధరకు వడ్లు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. కొత్త వ్యవసాయ బిల్లు రైతుల పాలిట శాపంగా మారిందని హరీష్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-13T19:17:00+05:30 IST