‘ఉద్యానం’తో పోడు రైతులను ఆదుకోండి: హరిప్రియ
ABN , First Publish Date - 2020-03-16T10:14:28+05:30 IST
రాష్ట్రంలోని పోడుభూముల్లో ఉద్యాన శాఖ ద్వారా మొక్కలను నాటాలని, వాటి నిర్వహణ బాధ్యతను పోడు రైతులకే ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
బిల్లు అనగానే వైద్యుడు దెయ్యమవుతాడు: సంజయ్కుమార్
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి: బిగాల గణేశ్
హైదరాబాద్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోడుభూముల్లో ఉద్యాన శాఖ ద్వారా మొక్కలను నాటాలని, వాటి నిర్వహణ బాధ్యతను పోడు రైతులకే ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కోరారు. పోడు భూముల సమస్య ఎన్నో ఏళ్లుగా ఉందని, పరిష్కరించి పోడు రైతులను ఆదుకోవాలన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. ‘రోగం వచ్చినప్పుడు వైద్యుడు దేవుడిలాగా కనిపిస్తాడు. బిల్లు చెల్లించమని అడగగానే దెయ్యంలా కనిపిస్తాడు’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
అలాగే, కొందరు వైద్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఒక వైద్యుడిగా ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ కోరారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న మాదాపూర్, మెహిదీపట్నం, తదితర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ లేన్ను ఏర్పాటు చేయాలని విన్నవించారు.