ప్రగతిభవన్ వద్ద గురుకుల పీఈటీల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-07T19:48:38+05:30 IST

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ప్రగతిభవన్ వద్ద గురుకుల పీఈటీల ఆందోళన

హైదరాబాద్: సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా పీఈటీలు నిరసనకు దిగారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి వచ్చిన పీఈటీలు సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. 2017 నోటిఫికేషన్‌కు సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే కౌంటర్ వేసి తమకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని పీఈటీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో క్యాంప్ ఆఫీసు ముట్టడికి వచ్చిన సమయంలో చిన్నపిల్లలను తీసుకువచ్చి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయకపోతే కారుణ్య మరణాలే శరణ్యమంటూ వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన తెలుపుతామని పీఈటీలు స్పష్టం చేశారు.  

Updated Date - 2020-12-07T19:48:38+05:30 IST