మహబూబాబాద్లో తుపాకుల కలకలం
ABN , First Publish Date - 2020-11-13T19:18:52+05:30 IST
మహబూబాబాద్ నగరంలో తుపాకులు కలకలం రేపుతున్నాయి.
మహబూబాబాద్: నగరంలో తుపాకులు కలకలం రేపుతున్నాయి. గన్లతో బెదిరింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న కేసముద్రం మండలం, ఉప్పరపల్లిలో కొందరు యువకులు తుపాకులతో వ్యాపారులను బెదిరించిన ఘటన మరువకముందే మహబూబాబాద్లో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఉండే మహబూబాబాద్కు గన్ కల్చర్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.
మహబూబాబాద్లోని ఓ వైన్ షాపు వద్ద చిన్న గొడవ జరిగింది. దీంతో దుండగులు గన్తో ఓ వ్యక్తిని బెదిరించారు. ఆ గన్ను చూసిన ఎదుటి వ్యక్తికి గుండె అగినంతపనైంది. ఇదంతా చూసిన స్థానికులు భయాందోళనలు చెందారు. వారం క్రితం కూడా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, ఉప్పరపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పలువురు వ్యాపారులను తుపాకులతో బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.