గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు

ABN , First Publish Date - 2020-11-21T14:04:44+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగియడంతో ఎన్నికల అధికారులు..

గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగియడంతో ఎన్నికల అధికారులు శనివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. మొత్తం 2,602 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం ఒక్కరోజే 1,937 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ- 571, టీఆర్ఎస్‌- 557, కాంగ్రెస్‌- 372, టీడీపీ- 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 


డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 4న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించిన విషయం తెలిసిందే. 21న (శనివారం) నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 24 చివరి తేదీ అని ఈసీ ప్రకటించింది.

Updated Date - 2020-11-21T14:04:44+05:30 IST