ధాన్యం ఇంకెప్పుడు కొంటారు?
ABN , First Publish Date - 2020-12-05T08:44:47+05:30 IST
ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం చెందిన రైతులు ధాన్యానికి నిప్పుపెట్టారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని పాలకులు చెబుతున్నా,
నసరుల్లాబాద్లో రోడ్డుపై వడ్లు ఽపోసి నిప్పు
జడ్చర్ల, డిసెంబరు 4 : ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం చెందిన రైతులు ధాన్యానికి నిప్పుపెట్టారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని పాలకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ సమీపంలో అన్నదాతలు శుక్రవారం రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించారు.
గ్రామ సమీపంలోని రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టామని, పంటను కొనాలని కొనుగోలు కేంద్రం అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనను వీడియో రికార్డు చేసి కలెక్టర్ వెంకట్రావుకు పంపించారు. దీంతో అదనపు కలెక్టర్ సీతారామారావు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పంటలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.