పేదలను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలి: గవర్నర్
ABN , First Publish Date - 2020-09-14T09:04:07+05:30 IST
కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గవర్నర్
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. ఆదివారం చెన్నైలో జరిగిన ‘రోటరీ సభ’ కార్యక్రమంలో రాజ్భవన్ నుంచి ఆమె వర్చువల్గా పాల్గొన్నారు. దేశంలో పోలియో, అంధత్వ నివారణలో రోటరీ సేవలు మరువలేనివని తమిళిసై అన్నారు.