జూలై 6 నుంచి ఎంసెట్
ABN , First Publish Date - 2020-05-24T08:19:26+05:30 IST
తెలంగాణలో ఎంసెట్తోపాటు పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 6 నుంచి..

- లాసెట్ జూలై 10న.. ఎడ్సెట్ 15న.. పీజీ సెట్ 1 నుంచి
- ఈసెట్ 4న.. ఐసెట్ 13న.. ప్రవేశ పరీక్షల తేదీలివే..
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎంసెట్తోపాటు పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టీఎస్ పీజీఈ సెట్ను జూలై 1 నుంచి 3 వరకు, టీఎస్ ఈసెట్ను జూలై 4వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరె డ్డి, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్మిత్తల్, విశ్వవిద్యాలయాల వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయా ప్రవే శ పరీక్షల తేదీలను నిర్ణయించారు. కాగా, కరోనా వైరస్ ప్రభావ ం నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. యూజీసీ సలహాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు.