ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో పారదర్శకత పాటించాలి

ABN , First Publish Date - 2020-12-31T04:32:25+05:30 IST

ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో పారదర్శకత పాటించాలి

ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో పారదర్శకత పాటించాలి

గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హన్మకొండ అర్బన్‌, డిసెంబరు 30: ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో పారదర్శకత పాటించి మెరిట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశించారు. బుధవారం కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల వివరాలను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు. మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం చేయొద్దని వీసీకి సూచించారు. ఇటీవల పలువురు విద్యార్థులు గవర్నర్‌ను కలిసి అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకల గురించి వివరించారు. దీంతో వెంటనే గవర్నర్‌ వీసీని పిలిపించి మాట్లాడారు. 

 

Updated Date - 2020-12-31T04:32:25+05:30 IST