గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసం
ABN , First Publish Date - 2020-04-29T02:13:11+05:30 IST
కస్టమర్ సమస్యనే అవకాశంగా మలుచుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. బాధితుడి నుంచి రూ.64 వేలు కాజేశారు. వివరాల్లోకెళితే.. మాసబ్ట్యాంక్కు చెందిన రాజేష్ అనే వ్యక్తి గూగుల్ పే

హైదరాబాద్: కస్టమర్ సమస్యనే అవకాశంగా మలుచుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. బాధితుడి నుంచి రూ.64 వేలు కాజేశారు. వివరాల్లోకెళితే.. మాసబ్ట్యాంక్కు చెందిన రాజేష్ అనే వ్యక్తి గూగుల్ పే ద్వారా ఫోన్ రీచార్జ్ చేసుకున్నాడు. అయితే రీచార్జ్ కాకపోవడంతో కస్టమర్ కేర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. అక్కడ ఉన్న ఓ నంబర్కు కాల్ చేసి తన సమస్యను వివరించారు. అదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. తక్షణం ఫోన్ రీచార్జ్ కావాలంటే తాము పంపించిన లింక్ను యాక్సెప్ట్ చేయాలని బాధితుడిని నమ్మించారు. ఆ వెంటనే లింక్ పంపించగా.. బాధితుడు యాక్సెప్ట్ చేశాడు. దీంతో బాధితుడి యూపీఐ నంబర్ ద్వారా రూ.64వేలు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసాన్ని గ్రహించిన బాధితుడు రాజేష్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.