భద్రాచలంలో పెరిగిన గోదావరి నీటిమట్టం

ABN , First Publish Date - 2020-05-18T15:57:58+05:30 IST

భద్రాచలంలో గోదావరి నదీ ప్రవాహం స్వల్పంగా పెరిగింది.

భద్రాచలంలో పెరిగిన గోదావరి నీటిమట్టం

భద్రాచలంలో గోదావరి నదీ ప్రవాహం స్వల్పంగా పెరిగింది. మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో భద్రాద్రిలో స్వలంగా నీటి ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ నుంచి గత మంగళవారం ఆరు గేట్లు ఎత్తి.. ఆరువేల క్యూసెక్కుల నీరు దిగువన ఉన్నగోదావరిలోకి విడుదల చేశారు. దీంతో భద్రాచలంలో 3.2 అడుగులతో కనిష్టంగా ఉన్న గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగి ప్రస్తుతం 5.2 అడుగుల వద్దకు చేరుకుంది. ఏటా ఇదే సమయంలో గోదావరిలో బండరాళ్లు, ఇసుక తిన్నెలతో పూర్తిగా ఏడారిని తలపిస్తూ ఉండేది. గత ఏడాది వారంపాటు తాగేందుకు నీరు లభ్యం కాలేదు.

Updated Date - 2020-05-18T15:57:58+05:30 IST