హైదరాబాద్లో వరద బాధితులకు సాయం ముమ్మరం
ABN , First Publish Date - 2020-10-28T23:53:21+05:30 IST
నగరంలో వరద బాధితులకు సాయం అందించే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. బాధితుల్ని అన్ని విధాలుగా..
హైదరాబాద్: నగరంలో వరద బాధితులకు సాయం అందించే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. పరిహారం పంపిణీలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని బొంతు రామ్మోహన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే లక్షకు పైగా వరద బాధితులకు రూ. 10 వేలు అందించామని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలాగా సాయం చేస్తున్నారని రామ్మోహన్ చెప్పారు.