జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘ఆమె’కు అగ్ర తాంబూలం
ABN , First Publish Date - 2020-11-21T14:00:21+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మహిళలకు పెద్ద పీట వేసింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రకారం గ్రేటర్లోని 150 డివిజన్లలో మహిళలకు 75 సీట్లు (50 శాతం) కేటాయించాలి. కానీ అధికార పార్టీ 84 మంది మహిళలకు అవకాశం కల్పించింది. రిజర్వేషన్ కోటా కంటే అధికంగా తొమ్మిది మంది మహిళలను

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మహిళలకు పెద్ద పీట వేసింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రకారం గ్రేటర్లోని 150 డివిజన్లలో మహిళలకు 75 సీట్లు (50 శాతం) కేటాయించాలి. కానీ అధికార పార్టీ 84 మంది మహిళలకు అవకాశం కల్పించింది. రిజర్వేషన్ కోటా కంటే అధికంగా తొమ్మిది మంది మహిళలను బరిలో నిలిపింది. బీసీ, ఎస్సీ జనరల్ స్థానాలతోపాటు అన్రిజర్వ్డ్ డివిజన్లలో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. 2016లో కూడా టీఆర్ఎస్ నుంచి మెజార్టీ మహిళా కార్పొరేటర్లు విజయం సాధించారు.
డివిజన్ | రిజర్వేషన్ | అభ్యర్థి |
చర్లపల్లి | బీసీ జనరల్ | బొంతు శ్రీదేవీయాదవ్ |
బీఎన్రెడ్డి నగర్ | అన్ రిజర్వ్డ్ | లక్ష్మీ ప్రసన్నగౌడ్ |
బంజారాహిల్స్ | అన్రిజర్వ్డ్ | గద్వాల విజయలక్ష్మి |
చాంద్రాయణగుట్ట | బీసీ జనరల్ | సంతోష్ రాణి |
ఉప్పుగూడ | అన్రిజర్వ్డ్ | ఎం. శోభారామిరెడ్డి |
జంగమ్మెట్ | అన్రిజర్వ్డ్ | కే స్వరూపరామ్సింగ్ నాయక్ |
బేగంబజార్ | అన్రిజర్వ్డ్ | పూజావ్యాస్ బిలాల్ |
దూద్బౌలి | బీసీ జనరల్ | షబానా అంజుమ్ |
రామచంద్రాపురం | బీసీ జనరల్ | పుష్పనాగేష్ యాదవ్ |