ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు!
ABN , First Publish Date - 2020-08-22T08:28:06+05:30 IST
ఒకవైపు చుట్టుముడుతున్న అగ్నికీలలు.. కాలిపోతున్న పవర్హౌజ్.. తోటి ఉద్యోగులు ఏమైపోయారోననే ఆవేదన, తరుముకొస్తున్న మృత్యువు..
ఒకవైపు చుట్టుముడుతున్న అగ్నికీలలు.. కాలిపోతున్న పవర్హౌజ్.. తోటి ఉద్యోగులు ఏమైపోయారోననే ఆవేదన, తరుముకొస్తున్న మృత్యువు.. భీతావహమైన ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి జెన్కో ఉద్యోగులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పాదన జరుగుతుండడంతో, ఒక్కోయూనిట్లో ఏఈ, సబ్ఇంజనీర్, జేపీఏ, ప్లాంట్ అటెండెంట్ కలుపుకొని ముగ్గురు నలుగురు సిబ్బంది పనిచేస్తుంటారు. రోజూ వారు షిఫ్టులవారీగా విఽధులు నిర్వహిస్తారు. గురువారం రాత్రి షిఫ్టులో ఆరుయూనిట్లలో 16 మంది విదుల్లో ఉన్నారు. బ్యాటరీలను రీప్లేస్ చేయడానికి ఎమరాన్ కంపెనీ నుంచి ఇద్దరు టెక్నిషియన్లు రావడంతో ఏఈ ఫాతిమా పవర్హౌజ్ షిప్టులోకి వారితో కలిసి వెళ్లారు. సుమారు 10.35 సమయంలో మూడో యూనిట్లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షి డ్రైవర్ పాల్ వెంకయ్య తెలిపారు.