యాదాద్రిలో నాలుగు కార్లు ఢీ.. పూర్తిగా ధ్వంసం

ABN , First Publish Date - 2020-10-04T01:31:05+05:30 IST

తెలంగాణలో ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.

యాదాద్రిలో నాలుగు కార్లు ఢీ.. పూర్తిగా ధ్వంసం

యాదాద్రి-భువనగిరి : తెలంగాణలో ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. శనివారం రాత్రి యాదాద్రిలోని చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న నాలుగు కార్లు ఒక దానికొకటి వెనుక నుంచి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే.. వాహనదారులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


ఈ విషయం గమనించిన వాహనదారులు, స్థానికులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది..? గాయపడ్డ వ్యక్తులు ఎవరు..? అనే విషయాలు తెలియరాలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.

Updated Date - 2020-10-04T01:31:05+05:30 IST