కరోనా టెస్టులు చేయని దుస్థితి తెలంగాణలోనే ఉంది: వివేక్
ABN , First Publish Date - 2020-06-23T18:06:40+05:30 IST
కరోనా టెస్టులు చేయని దుస్థితి తెలంగాణలోనే ఉంది: వివేక్

నల్లగొండ: ఆర్టికల్ 370 రద్దు చేయాలని మొదటి నుండి ఉద్యమం చేసింది శ్యామా ప్రసాద్ ముఖర్జీనే అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు అదుపు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. పాలన పక్కన బెట్టి ఫామ్హౌస్లో ప్రాజెక్టుల్లో కమిషన్ లెక్కలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారన్నారు. కనీసం టెస్టులు చేయని దుస్థితి మన తెలంగాణలోనే ఉందని వివేక్ వ్యాఖ్యానించారు.