నిబంధనల్ని పాటించండి: మహమూద్ అలీ
ABN , First Publish Date - 2020-04-08T08:45:54+05:30 IST
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏ చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం...

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏ చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అకారణంగా రోడ్లపై తిరుగుతున్న 1400 వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.