కరీంనగర్‌లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2020-03-23T16:25:59+05:30 IST

తొలి కరోనా పాజిటివ్‌ కేసు కరీంనగర్‌లో నమోదయింది.

కరీంనగర్‌లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

కరీంనగర్‌: తొలి కరోనా పాజిటివ్‌ కేసు కరీంనగర్‌లో నమోదయింది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కరోనా బాధితుడిని కలిసిన వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కరోనా బాధితుడిని అధికారులు కరీంనగర్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-03-23T16:25:59+05:30 IST