పంటకు ‘మంట’..!
ABN , First Publish Date - 2020-10-24T09:27:57+05:30 IST
ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేస్తే.. కోతకు వచ్చిన పంట దోమపోటుతో దెబ్బతిందని ఆగ్రహం చెందిన రైతులు పైరుకు నిప్పంటించకున్నారు.

కామారెడ్డి/గంభీరావుపేట: ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేస్తే.. కోతకు వచ్చిన పంట దోమపోటుతో దెబ్బతిందని ఆగ్రహం చెందిన రైతులు పైరుకు నిప్పంటించకున్నారు. కామారెడ్డి జిల్లా లింగాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలలో శుక్రవారం ఈ ఘటనలు జరిగాయి. లింగాపూర్కు చెందిన రైతు నారాయణ, ఆంజనేయులు, గంభీరావుపేటలో రైతు దేవరాజులు వరి సాగు చేయగా దోమపోటు తెగులు సోకి పాడై పోయింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో పంటకు నిప్పంటించుకుని నిరసన వ్యక్తం చేశారు.