ఏడు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ఖరారు

ABN , First Publish Date - 2020-06-01T08:51:08+05:30 IST

రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ఖరారు చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు.

ఏడు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ఖరారు

రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ఖరారు చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ వారి పేర్లను ప్రకటించారని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రతాప్‌ రామకృష్ణ, మెదక్‌కు గడ్డం శ్రీనివాస్‌, సిద్దిపేటకు దూది శ్రీకాంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు ఎర్ర శేఖర్‌, వనపర్తికి డాక్టర్‌ ఎ.రాజవర్ధన్‌రెడ్డి, మహబూబాబాద్‌కు పెద్దిరాజు రాంచందర్‌రావు, ములుగుకు చింతలపూడి భాస్కర్‌రెడ్డిలను నియమించారని వెల్లడించారు.

Updated Date - 2020-06-01T08:51:08+05:30 IST