ఎఫ్బీవో నడక పరీక్షలో 390 మంది అర్హత
ABN , First Publish Date - 2020-10-01T07:15:15+05:30 IST
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన మూడో విడత నడక పరీక్షలో 390 మంది....
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన మూడో విడత నడక పరీక్షలో 390 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎ్సపీఎస్సీ తెలిపింది. ఆన్లైన్ ద్వారా వారి ధ్రువపత్రాలను పరిశీలిస్తామని పేర్కొంది. నాలుగో విడత అర్హత పరీక్షకు రాత పరీక్షలో మెరిట్ ప్రకారం 823 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, త్వరలోనే తేదీలను ప్రకటించి.. అటవీశాఖ ఆధ్వరంలో నడక పరీక్షలను నిర్వహిస్తామని వివరించింది.