రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
ABN , First Publish Date - 2020-04-24T09:43:21+05:30 IST
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వరి, మొక్కజొన్న ధాన్యిన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్రెడ్డి అన్నారు.
గీసుగొండ, ఏప్రిల్ 23: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వరి, మొక్కజొన్న ధాన్యిన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు నిర్వాహణపై గీసుగొండ, సంగెం, దుగ్గొండి మండలాల పాక్స్ చైర్మన్లకు ఎంపీడీవో కార్యాయలంలో శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీవో పుల్లారావు, నోడల్ అధికారులు రేఖా, శ్రీనివాస్, తహసీల్దార్లు కనకయ్య, సుహాసిని, ఎంపీడీవో రమేష్, ఏవో హరిప్రసాద్బాబు పాల్గొన్నారు.