అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ ఎదుట రైతు కటుంబం ధర్నా
ABN , First Publish Date - 2020-11-03T17:23:14+05:30 IST
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ ఎదుట రైతు కటుంబం ధర్నాకు దిగింది. ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం ఘటనలో...
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ ఎదుట రైతు కటుంబం ధర్నాకు దిగింది. ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం ఘటనలో... ఆమెను కాపాడబోయి నారాయణ అనే వృద్ధ రైతు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. అలాంటి నారాయణ.. మూడేళ్ళుగా పాసు బుక్ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో విసిగిపోయిన నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ ఎదుట ఆందోళనకు దిగాడు.