యూరియా కోసం బారులు

ABN , First Publish Date - 2020-08-22T08:38:23+05:30 IST

వికారాబాద్‌ జిల్లా ధారూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా సంచుల కోసం

యూరియా కోసం బారులు

ధారూరు : వికారాబాద్‌ జిల్లా ధారూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా సంచుల కోసం రైతులు బారులు తీరారు. ఒక లారీలో 450 సంచుల ఎరువు రాగా ఏవో జ్యోతి, పీఏసీఎస్‌ సీఈవో నర్సింహులు గోదాం వద్ద నిలబడి పంపిణీని పర్యవేక్షించారు. పంట సాగు చేసిన విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో రైతుకు ఒకటి నుంచి రెండు బస్తాలు ఇచ్చి సరిపెట్టారు. మిగిలిన వారికి మళ్లీ యూరియా వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి పంపించారు. కాగా, ఒక్కో సంచి యూరియా ఇవ్వడంపై  రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-22T08:38:23+05:30 IST