తహసీల్దార్‌ హామీతో రైతు దీక్ష విరమణ

ABN , First Publish Date - 2020-12-29T07:39:13+05:30 IST

మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్‌ భూ సమస్య పరిష్కరించాలంటూ రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తహసీల్దార్‌ కవిత హామీతో సోమవారం విరమించాడు.

తహసీల్దార్‌ హామీతో రైతు దీక్ష విరమణ

తాండూర్‌ (బెల్లంపల్లి), డిసెంబరు 28: మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్‌ భూ సమస్య పరిష్కరించాలంటూ రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తహసీల్దార్‌ కవిత హామీతో సోమవారం విరమించాడు. ధరణిలో పార్టు-బీకి సంబంధించిన వివరాలు చూపకపోవడం వల్లనే సమస్య పరిష్కారం కాలేదని, వెబ్‌సైట్‌లో వివరాలు చూపగానే పరిష్కరిస్తానని తహసీల్దార్‌ చెప్పారు. 

Updated Date - 2020-12-29T07:39:13+05:30 IST