ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు ఇవ్వాలి: తమ్మినేని

ABN , First Publish Date - 2020-06-01T09:46:06+05:30 IST

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అర్హులైన పేద కటుంబాలకు రేషన్‌ కార్డులు

ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు ఇవ్వాలి: తమ్మినేని

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అర్హులైన పేద కటుంబాలకు రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల కార్డులు తీసుకుని చాలా చౌక డిపోలు బియ్యం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టాయని తెలిపారు. కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ రాయితీలతో పాటు ఉపాధి లభించడం కూడా కష్టంగా మారిందని చెప్పారు. 

Updated Date - 2020-06-01T09:46:06+05:30 IST