డయాలసిస్ రోగికి ఏడాదికి రూ. 1.80 లక్షలు ఖర్చు: ఈటల
ABN , First Publish Date - 2020-03-12T10:09:08+05:30 IST
రాష్ట్రంలో ఒక్కో డయాలసిస్ రోగి రక్తాన్ని శుద్ధి చేయడానికి సర్కారు ప్రతీ ఏట రూ. 1.80 లక్షల ఖర్చు చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో 45 కేంద్రాల్లో డయాలసిస్ సేవలందిస్తున్నామని
![డయాలసిస్ రోగికి ఏడాదికి రూ. 1.80 లక్షలు ఖర్చు: ఈటల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాష్ట్రంలో ఒక్కో డయాలసిస్ రోగి రక్తాన్ని శుద్ధి చేయడానికి సర్కారు ప్రతీ ఏట రూ. 1.80 లక్షల ఖర్చు చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో 45 కేంద్రాల్లో డయాలసిస్ సేవలందిస్తున్నామని, అవసరమైతే ఈ కేంద్రాలను పెంచుతామని శాసన మండలిలో చెప్పారు. రాష్ట్రంలో 10 వేలమందికి పైగా డయాలసిస్ రోగులు ఉన్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన ప్రారంభిస్తామన్నారు.