ఈఎస్ఐ స్కామ్లో మరోసారి ఏసీబీ దాడులు
ABN , First Publish Date - 2020-09-01T22:14:00+05:30 IST
ఈఎస్ఐ స్కామ్లో మరోసారి ఏసీబీ దాడులు

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్లో మరోసారి ఏసీబీ దాడులు చేసింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేందుకు దేవికారాణి, నాగలక్ష్మి యత్నించారని అధికారులు పేర్కొన్నారు. రూ.4 కోట్ల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. స్థలం కొనుగోలుకు ఓ బిల్డర్కు డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు. ఈఎస్ఐ డైరెక్టర్గా ఉండగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.