ప్రభుత్వ ముద్రణాలయo ఉద్యోగులు ధర్నా

ABN , First Publish Date - 2020-06-26T20:29:33+05:30 IST

కరోనా కట్టడి చర్యలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని..

ప్రభుత్వ ముద్రణాలయo ఉద్యోగులు ధర్నా

హైదరాబాద్: కరోనా కట్టడి చర్యలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణలయo ఉద్యోగులు   కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులుగా 8 మంది ఉద్యోగులు కరోనా భారిన పడినా... అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదని  యూనియన్ నేతలు ఆరోపించారు. ఉద్యోగుల హాజరు నియమాన్ని పాటించకుండా అధికారులు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2020-06-26T20:29:33+05:30 IST