రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
ABN , First Publish Date - 2020-12-06T07:52:29+05:30 IST
అగ్రిహబ్ ఫౌండేషన్తో 11 వ్యవసాయ అంకుర సంస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని ఆచార్య

వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ
హైదరాబాద్, రాజేంద్రనగర్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అగ్రిహబ్ ఫౌండేషన్తో 11 వ్యవసాయ అంకుర సంస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యం శనివారం కుదుర్చుకుంది.
వర్సిటీ వీసీ వి.ప్రవీణ్రావు మాట్లాడు తూ.. రైతుల ఆదాయం రెట్టింపుతో పాటు పంటల ఉత్పత్తి, ఉత్పాద కత పెంపులో వ్యవసాయ అంకుర సంస్థలు కీలకపాత్ర పోషించా లని అన్నారు. ఒప్పందం పత్రాలపై వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.సుధీర్ కుమార్, వివిధ అంకుర సంస్థల ప్రతినిఽధులు సంతకాలు చేశారు.