టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఈసీ

ABN , First Publish Date - 2020-12-05T09:17:45+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా పనిచేసిందని టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఈసీ

 ఈ కమిషన్‌తో ప్రజాధనం వృధా: మర్రి శశిధర్‌రెడ్డి 

హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా పనిచేసిందని టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఎన్నికల సంఘం ఉంటే ప్రజాధనం వృధా అని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


టీఆర్‌ఎస్‌ నేతల ఒత్తిడికి తలొగ్గిన ఈసీ.. వరదలు, కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ఇతర పార్టీలు చెప్పినా పట్టించుకోలేదన్నారు. వరద పరిహారం పేరుతో అధికార పార్టీ ఈ ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు చేసిందన్నారు. ఓ పోలింగ్‌ కేంద్రంలో చనిపోయిన వ్యక్తి ఓటు కూడా పోల్‌ అయిందంటే సిబ్బంది నిర్లక్ష్యం తెలుస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ సమీక్ష నిర్వహిస్తుందన్నారు. 


Updated Date - 2020-12-05T09:17:45+05:30 IST