హైదరాబాద్లో డ్రగ్స్ పట్టివేత
ABN , First Publish Date - 2020-07-20T00:20:39+05:30 IST
నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ తార్నాకలో ఇద్దరు నైజీరియన్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ తార్నాకలో ఇద్దరు నైజీరియన్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 104గ్రాముల కొకైన్, లక్షా 64వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు అమ్ముతున్న జోడిపాస్కెల్ అతని ప్రియురాలు మోనికలను అరెస్టు చేశారు. పరారీలో మరో ముగ్గురు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం మోనిక, ముంబయి నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. జోడిపాస్కెల్, మోనిక తార్నాకలోని నాగార్జున కాలనీలో నివాసముంటున్నారు. తార్నాక కూడలి వద్ద ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు అరెస్టు చేశారు.