మావోయిస్టుల కదలికలపై డ్రోన్‌ నిఘా

ABN , First Publish Date - 2020-09-14T09:22:46+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండడం, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అలజడి రేపుతుండడంతో పోలీసులు

మావోయిస్టుల కదలికలపై డ్రోన్‌ నిఘా

  • దండకారణ్యంలో వాగు దాటిన మావోయిస్టులు

చర్ల, సెప్టెంబరు 13: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండడం, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అలజడి రేపుతుండడంతో పోలీసులు పటిష్ఠ నిఽఘా పెట్టారు. మావోల కదలికలను తెలుసుకునేందుకు వారు నిత్యం సంచరించే ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం సుకుమా జిల్లా కిష్టారంపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలోడు గ్రామం వద్ద మావోయిస్టులు అటవీ మార్గంలో వాగుదాటుతున్న దృశ్యాలు డ్రోన్‌ కెమెరాకు చిక్కాయి. సుమారు 200 మందికి పైగా మావోలు దట్టమైన అడవిలో నడుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.

Updated Date - 2020-09-14T09:22:46+05:30 IST