సీఎం సహాయనిధికి కోదాడ వ్యాపారుల విరాళం
ABN , First Publish Date - 2020-06-03T23:36:47+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు కోదాడ నియోజక వర్గానికి చెందిన వ్యాపారులు ముందుకు వచ్చారు.
హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు కోదాడ నియోజక వర్గానికి చెందిన వ్యాపారులు ముందుకు వచ్చారు. ఇందులో రైస్ మిల్లర్లు, క్రషర్లు, కెమికల్ ఫ్యాక్టరీ యజమానులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 62 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ప్రగతి భవన్లో అందజేశారు.