మహనీయులను రచ్చకీడుస్తారా?
ABN , First Publish Date - 2020-11-27T07:41:16+05:30 IST
‘‘తెలుగు జాతికి గర్వకారణమైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్లాంటి మహనీయులను రాజకీయ ప్రయోజనాల

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: చంద్రబాబు
హైదరాబాద్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు జాతికి గర్వకారణమైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్లాంటి మహనీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా?’’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జాతీయ రాజకీయాలకు వన్నెతెచ్చిన తెలుగు వెలుగులు వారని కొనియాడారు.
‘‘హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర అందరికీ తెలుసు. ఆ పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని గురువారం ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించిన మేధావి పీవీ నర్సింహారావు అని కొనియాడారు.