ఓవైసీ అలా మాట్లాడటం బాధాకరం..: డీకే అరుణ

ABN , First Publish Date - 2020-04-04T23:29:16+05:30 IST

హిందూ ధర్మాన్ని, సాంసృతిని అవమానించేలా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడటం బాధాకరమని మాజీ మంత్రి...

ఓవైసీ అలా మాట్లాడటం బాధాకరం..: డీకే అరుణ

హైదరాబాద్ : హిందూ ధర్మాన్ని, సాంసృతిని అవమానించేలా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడటం బాధాకరమని మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం అవివేకమన్నారు.


వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఓవైసీకి తెలియదని.. ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని ఆమె హితువు పలికారు. దేశ ఐక్యత కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చారని అరుణ గుర్తు చేశారు. వైద్యులకు మనోధైర్యం అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 దీపాలు వెలిగించాలని అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-04T23:29:16+05:30 IST