చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని కొనసాగించాలి: డీకే అరుణ
ABN , First Publish Date - 2020-08-13T02:52:00+05:30 IST
గద్వాల జిల్లా కేంద్రంగానే చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కొనసాగించాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె..

హైదరాబాద్: గద్వాల జిల్లా కేంద్రంగానే చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కొనసాగించాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్కు ఎందుకంత కక్ష అని ఫైర్ అయ్యారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలు పెంచుతున్న నేపథ్యంలో గద్వాలలో ఉన్న చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని ఎత్తివేయాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.