టీఆర్ఎస్పై డీకే అరుణ విమర్శలు
ABN , First Publish Date - 2020-12-13T23:01:20+05:30 IST
కుటుంబ పాలన అంతానికి ప్రజలు సిద్ధమవుతున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: తెలంగాణలో కుటుంబ పాలన అంతానికి ప్రజలు సిద్ధమవుతున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు. మోదీపై యుద్ధమేనన్న కేసీఆర్ వంగి వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హైదరాబాద్ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి కేసీఆర్ కోలుకోలేదని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఎంతోమంది రైతులకు మేలు జరుగుతందని తెలిపారు. టీఆర్ఎస్ నియంతృత్వ విధానాలతో ప్రజలు విసిగి పోయారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.