బీజేపీ మేయర్ స్థానం గెలవబోతోంది: డీకే అరుణ
ABN , First Publish Date - 2020-12-02T02:28:41+05:30 IST
బీజేపీ మేయర్ స్థానం గెలవబోతోంది: డీకే అరుణ

హైదరాబాద్: పొలింగ్ శాతం తగ్గేలా టీఆర్ఎస్ కుట్రకు పాల్పడిందని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. పోలింగ్ ముందు నాలుగు రోజులు సెలవులు వచ్చేలా ప్లాన్ చేశారని ఆరోపించారు. బీజేపీ మేయర్ స్థానం గెలవబోతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగైందని విమర్శించారు.