పాత అసెంబ్లీ భవనంలోకి మండలి
ABN , First Publish Date - 2020-03-13T10:22:47+05:30 IST
బడ్జెట్ సమావేశాలు ముగిశాక శాసనమండలి పాత అసెంబ్లీ భవనంలోకి మారనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ శాసనసభ సమావేశాలు పాత అసెంబ్లీ భవనంలో జరిగిన సంగతి తెలిసిందే.
![పాత అసెంబ్లీ భవనంలోకి మండలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్ సమావేశాలు ముగిశాక శాసనమండలి పాత అసెంబ్లీ భవనంలోకి మారనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ శాసనసభ సమావేశాలు పాత అసెంబ్లీ భవనంలో జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ అమరావతికి మారిన తర్వాత ఈ భవనం తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. భద్రత, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. శాసనమండలిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకే మార్చాలని నిర్ణయించింది.