హరీశ్‌ చొరవతో వీడియో జర్నలిస్టులకు సరుకులు

ABN , First Publish Date - 2020-05-13T10:05:15+05:30 IST

మంత్రి హరీశ్‌రావు చొరవతో 100 మంది వీడియో జర్నలిస్టులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

హరీశ్‌ చొరవతో వీడియో జర్నలిస్టులకు సరుకులు

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): మంత్రి హరీశ్‌రావు చొరవతో 100 మంది వీడియో జర్నలిస్టులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మంగళవారం ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో.. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, 5 కిలోల వంట నూనె, 5 కిలోల చక్కెర చొప్పున వీడియో జర్నలిస్టులకు అందించారు. 

Updated Date - 2020-05-13T10:05:15+05:30 IST