నేటి నుంచి డిజిటల్ పాఠాలు : డీఈవో
ABN , First Publish Date - 2020-09-01T10:21:35+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా టీసాట్ యాదగిరి దూరదర్శన్ల

వరంగల్ రూరల్ కల్చరల్, ఆగస్టు 31: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా టీసాట్ యాదగిరి దూరదర్శన్ల ద్వారా డిజిటల్ పాఠాలు ప్రసారం కానున్నాయి. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరికి డిజిటల్ ద్వారా పాఠాలు ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి తెలిపారు. ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులకు డి జిటల్ పాఠాలు ప్రసారం అయ్యేలా ఉపాధ్యాయుల బోధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.