మెడికల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని ధర్నా
ABN , First Publish Date - 2020-09-18T06:34:09+05:30 IST
ఎస్సాఆర్ఆర్ తోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ అరుణ్చంద్రను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు
హన్మకొండ అర్బన్, సెప్టెంబరు 17: ఎస్సాఆర్ఆర్ తోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ అరుణ్చంద్రను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు గురువారం అర్బన్ డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అర్బన్ జిల్లా ప్రధానకార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ డాక్టర్ అరుణ్చంద్ర వేధింపులతో పీహెచ్సీలో పనిచేస్తున్న సీవో విజయలక్ష్మి ఆత్మాహత్యాయతానికి పాల్పడి ప్రాణాలతో బయటపడిందని తెలిపారు. వైద్యసిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సోమవారం నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ డీఎంహెచ్వో మదన్మోహన్రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.
దీనిపై అడిషనల్ డీఎంహెచ్వో స్పందిస్తూ అరుణ్చంద్రపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మెడికల్ యూనియన్ జిల్లా నాయకుడు కిషన్, డి.మోహన్రావు, జి.సరిత, కె.వైకుంఠం, సదానందం, జ్యోతి, అరుణ, నర్మద, బూర రవీందర్, టీఎన్జీవోస్ ఏఎన్ఎం అధ్యక్షురాలు జె.ప్రభావతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.