ముదిరాజ్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2020-12-28T04:46:10+05:30 IST
ముదిరాజ్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

చిలుపూర్, డిసెంబ రు 27 : రాష్ట్ర ప్రభు త్వం ముదిరాజ్ల సంక్షేమంపై చిత్తశు ద్ధితో కృషి చేస్తోందని ఎంపీ , ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షు డు బండా ప్రకాశ్ అన్నారు. ఆదివారం మండలంలోని చిన్నపెండ్యాలలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. సర్పంచుల ఫోరం మండలధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, మత్స్యపారిశ్రామిక సొసైటీ జిల్లా డైరెక్టర్ నీల రాజు, ఎంపీటీసీ తాళ్ళపల్లి సమ్మయ్య, శాగ కుమారస్వామి, శ్రీనివాస్, పూజారి యల్లంభట్ల కరుణాకర్ శర్మ, నీల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.