పశువుల మేత కోసం భూమి కేటాయించాలి
ABN , First Publish Date - 2020-06-21T09:56:06+05:30 IST
పశువుల మేత కోసం భూమి కేటాయించాలి
![పశువుల మేత కోసం భూమి కేటాయించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- కోదండరాం, చాడ వెంకటరెడ్డి డిమాండ్
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పశువుల మేత కోసం 5.5 లక్షల ఎకరాల భూమిని కేటాయించి, దాన్ని సాగు చేసే రైతులకు మరింత సహకారం అందించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. ఇదే విషయమై కోదండరాం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు.