నేపాల్ దోపిడీ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు
ABN , First Publish Date - 2020-10-12T15:04:46+05:30 IST
హైదరాబాద్: నేపాల్ దోపిడీ గ్యాంగ్ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
![నేపాల్ దోపిడీ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: నేపాల్ దోపిడీ గ్యాంగ్ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం డీఎస్ఆర్ హిల్స్లో భారీగా నగదు చోరీకి సదరు గ్యాంగ్ పాల్పడింది. బోర్ వెల్ కాంట్రాక్టర్ ఇంట్లో రూ.15 లక్షలు, బంగారం చోరీకి గురైంది. వాచ్ మెన్, వంట మనుషులుగా ఇళ్లలో చేరి ఇంటికి కన్నం వేశారు. ఆహారంలో మత్తు మంది ఇచ్చి నేపాల్ గ్యాంగ్ దోపిడికి పాల్పడింది. నేపాల్ గ్యాంగ్ను సైబరాబాద్ పోలీసులు బార్డర్లో అరెస్ట్ చేశారు.