కరోనా బాధితులకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలి: సైబరాబాద్ సీపీ
ABN , First Publish Date - 2020-07-18T18:53:58+05:30 IST
కరోనా బాధితులకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలి: సైబరాబాద్ సీపీ

హైదరాబాద్: కరోనా సోకి రికవరీ అయిన వారందరికీ సైబరాబాద్ పోలీస్ తరుపున సీపీ సజ్జనార్ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా మంది కరోనాతో ఆస్పతుల్లో అడ్మిట్ అవుతున్నారని... కరోనా వైరస్ రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కోవిడ్ 19 బారిన పడి బయట పడిన వారు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని సీపీ కోరారు. మీరు ఇచ్చే 500 ఎమ్ఎల్తో ఇద్దరు రోగులను కాపాడిన వారు అవుతాని తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారన్నారు. సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారని...దీంతో ముగ్గురిని ఆదుకున్నారని తెలిపారు. మూడు కుటుంబాలను కాపాడారని అన్నారు. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440కి సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.