జర్నలిస్టుల కేసులపై కౌంటర్ దాఖలు చేయండి
ABN , First Publish Date - 2020-04-28T10:52:45+05:30 IST
లాక్డౌన్లో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు

హైదరాబాద్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్లో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని సామాజిక కార్యకర్త ఎస్.క్యూ. మసూద్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ధర్మాసనం స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.